Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రంతా నిద్రపోనివ్వలేదు ... వస్తువులు ధ్వంసం చేశారు : అచ్చెన్న భార్య

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో శుక్రవారం వేకువజామున టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, అరెస్టుకు ముందు ఏం జరిగిందో అచ్చెన్నాయుడు భార్య విజయ మాధూరి మీడియాకు వివరించారు. 
 
గురువారం రాత్రి 7.30 గంటలకే తమ ఇంటిని చుట్టుముట్టిన కొందరు, తాము ఏసీబీ అధికారులమంటూ ఇంట్లోకి వచ్చారని, తమకు ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితుల్లోనే రాత్రంగా గడచిపోయిందన్నారు. 
 
పైగా, తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాత్రంతా తన భర్తను నిద్రపోనివ్వలేదని, ఇల్లంతా సోదాలు చేశారని, కొన్ని వస్తువులను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. 
 
అర్థరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు అధికారులు చెప్పారని, ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే, ప్రభుత్వానిదే బాధ్యతని అని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments