Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రంతా నిద్రపోనివ్వలేదు ... వస్తువులు ధ్వంసం చేశారు : అచ్చెన్న భార్య

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో శుక్రవారం వేకువజామున టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, అరెస్టుకు ముందు ఏం జరిగిందో అచ్చెన్నాయుడు భార్య విజయ మాధూరి మీడియాకు వివరించారు. 
 
గురువారం రాత్రి 7.30 గంటలకే తమ ఇంటిని చుట్టుముట్టిన కొందరు, తాము ఏసీబీ అధికారులమంటూ ఇంట్లోకి వచ్చారని, తమకు ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితుల్లోనే రాత్రంగా గడచిపోయిందన్నారు. 
 
పైగా, తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాత్రంతా తన భర్తను నిద్రపోనివ్వలేదని, ఇల్లంతా సోదాలు చేశారని, కొన్ని వస్తువులను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. 
 
అర్థరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు అధికారులు చెప్పారని, ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే, ప్రభుత్వానిదే బాధ్యతని అని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments