Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ : అచ్చెన్నాయుడు

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ రెడ్డి అని ఆరోపించారు.
 
ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతమైందని తెలిపారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డైరీ రైతులను బలి తీసుకున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ డైరికి ఏపీ డైరీ ఆస్తులను ఒక యేడాది పాటుకు ఇస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాషపై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమూల్‌కు పాలు రాకపోవడంతో కక్షగట్టారన్నారు. 
 
బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయమని నిలదీశారు. అమూల్‌కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments