Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ : అచ్చెన్నాయుడు

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ రెడ్డి అని ఆరోపించారు.
 
ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతమైందని తెలిపారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డైరీ రైతులను బలి తీసుకున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ డైరికి ఏపీ డైరీ ఆస్తులను ఒక యేడాది పాటుకు ఇస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాషపై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమూల్‌కు పాలు రాకపోవడంతో కక్షగట్టారన్నారు. 
 
బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయమని నిలదీశారు. అమూల్‌కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments