Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా గురించి నన్ను మాట్లాడమని రెచ్చగొడుతున్నారా?: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (20:25 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా నిన్న ప్రివిలైజ్ కమిటీ ముందు ఏడ్చేశారు. ఇది కాస్త తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేగా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ కన్నీంటి పర్యంతమయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారని కన్నీళ్ళు పెట్టుకున్నారు రోజా.
 
అంతటితో ఆగలేదు ఎన్ని కమిటీల ముందుకు ఈ విషయాన్ని తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అంతేకాదు పరోక్షంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి గురించి కూడా వ్యాఖ్యలు చేశారు రోజా. ఉపముఖ్యమంత్రి పుత్తూరులో ఉండటం.. అక్కడే అధికారులతో సమావేశమవుతున్నారు.
 
గతంలో ఇదేవిధంగా పుత్తూరులో నారాయణస్వామి ఒక పర్యటనలో పాల్గొనడం.. రోజాను పిలవకపోవడంతో రోజాకు కోపమొచ్చింది. ఇది కాస్త పెద్ద రాద్దాంతమే జరిగింది. దీనిపై నారాయణస్వామి కూడా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రెడ్లందరూ తనను ముందుకు తీసుకువచ్చారని.. కానీ ఇప్పుడు ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు.
 
రోజా ఎందుకలా మాట్లాడారో ఆమె మనస్సాక్షిగా వదిలేస్తున్నానన్నారు నారాయణస్వామి. దళితుడైన తనను రెడ్లు ఆదరించారని.. వారే తనకు రాజకీయ భిక్ష పెట్టినట్లు చెప్పుకొచ్చారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవంటూ చెబుతూనే పార్టీలో ఇదంతా సహజమంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments