Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీపురుషులను ఒకే గదిలో నిర్బంధిస్తారా? చంద్రబాబు ఫైర్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:58 IST)
ఓ వైసీపీనేత ఫిర్యాదు చేశాడని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను ఏడేళ్ల చిన్నారితో సహా చిల్లకల్లు పోలీసు స్టేషన్‌కు తెచ్చి నిర్బంధించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. కొంతమంది పోలీసులు తాము అమలు చేయాల్సిన చట్టాలను వదిలేసి వైసీపీ నేతల మాటే చట్టంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు.
 
ఈ సందర్భంగా భూక్యా కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఓ గదిలో ఉన్న ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారు. ఆ గదిలో చిన్నారి కూడా ఉండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నారిలో మీకు ఏ నేరస్తుడు కనిపించాడు? స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్భంధించమని ఏ చట్టం చెబుతుందని మండిపడ్డారు.
 
కోవిడ్ నిబంధనలు పేరిట టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టే మీకు ఇలా గుంపుగా అందరినీ ఒకచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించిందని ప్రశ్నించారు. కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments