Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న గౌతం రెడ్డి అంత్యక్రియలు - అపోలో వైద్యులు స్టేట్మెంట్ రిలీజ్

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (14:23 IST)
తీవ్రమైన గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. అదేసమయంలో ఆయన మృతికి సంతాపసూచకంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 
 
ప్రస్తుతం గౌతం రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ రాజకీయ నేతలు, అభిమానుల సందర్శనార్థం సోమవారం సాయంత్రం వరకు ఉంచుతారు. ఆ తర్వాత గౌతం రెడ్డి మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లికి తీసుకొస్తారు. 
 
అయితే, గౌతంరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. ఆయన మంగళవారం సాయంత్రానికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే బుధవారం ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 
ఇదిలావుంటే గౌతం రెడ్డి మరణంపై హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి వద్ద గౌతం రెడ్డి కుప్పకూలారని, ఉదయం 7.45 గంటలకు అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 
 
స్పందించని స్థిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆయనకు శ్వాస ఆడటం లేదని చెప్పారు. ఐసీయులో వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఉదయం 9.16 గంటలకు ఆయన కన్నుమూశారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments