Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతులు మాట్లాడిన వైసీపీ నేతల్ని వదిలి, తెలుగు మహిళలను వేధిస్తారా?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (15:01 IST)
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించినందుకు, అనంతపురం తెలుగు మహిళా నేతల్ని పోలీసుల వేధించటం దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజార‌పు అచ్చెన్నాయుడు అన్నారు. అనంతపురంలోని తెలుగు మహిళా బీసీ నేతల ఇళ్లలోకి వెళ్లి, పోలీసులు సోదాల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు. 
 
 
పోలీసులు వారిని ఎందుకు వేదిస్తున్నారు? బూతులు మాట్లాడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి, బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా? వైసీపీ నేతలు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే, సాటి మహిళలుగా స్పందించటం తప్పా? మహిళల‎ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా‎ మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రత పెంచిన ప్రభుత్వం, మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను అరెస్టు చేస్తామని బెదిరించటం సిగ్గుమాలిన చర్య అని అచ్చెన్నాయుడు అన్నారు. 
 
 
అరెస్టు చేయాల్సింది తెలుగు మహిళలను కాదు, అసెంబ్లీ సాక్షిగా మహిళా లోకాన్ని అవమానించిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలను అరెస్టు చేయాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతల వ్యహహార శైలి, భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నార‌ని, ముఖ్యమంత్రికి మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా, అసెంబ్లీలో మహిళలను అవమానించిన వారిని వెంటనే పదవుల నుంచి తొలగించి మహిళలకు క్షమాపణలు చెప్పాల‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments