Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 25 జిల్లాల ఏర్పాటు దిశగా సీఎం జగన్ అడుగులు??

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (08:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ తరపున ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 13 జిల్లాలను ఒక్కో లోక్‌సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా చేస్తూ మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఒక్కో లోక్‌సభను ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన మరింత సులభతరంగా ఉంటుందనీ, పైగా, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసేందుకు సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ జిల్లాల కలెక్టర్లతో వ్యాఖ్యానించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు త్వరలోనే 25 జిల్లాలుగా మారనున్నాయి. ఆ ప్రకారంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతి పట్టణం చిత్తూరు జిల్లా నుంచి విడిపోయి జిల్లా కేంద్రంగా ఏర్పాటుకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments