Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు : తమ్మినేని సీతారాం

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:58 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో హింసాత్మక చర్యలకు కారణమైన నిందితులను గుర్తించిన తర్వాత అపుడుంటది బాదుడే బాదుడు అని ఏపీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఈ హింసాత్మక ఘటనలపై ఆయన స్పందిస్తూ, కోనసీమ అల్లర్లు బాధాకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 
 
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ, ఆయన పేరును మాత్రం వ్యతిరేకిస్తారా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం మొదలుపెడతామని హెచ్చరించారు. అంతేకాకుండా, శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ -2 పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తానంటూ అన్నారు. 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని పైగా ఇది నూటికి కోటి శాతం కరెక్టేనని చెప్పారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని తమ్మినేని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments