Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు : తమ్మినేని సీతారాం

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:58 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో హింసాత్మక చర్యలకు కారణమైన నిందితులను గుర్తించిన తర్వాత అపుడుంటది బాదుడే బాదుడు అని ఏపీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఈ హింసాత్మక ఘటనలపై ఆయన స్పందిస్తూ, కోనసీమ అల్లర్లు బాధాకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 
 
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ, ఆయన పేరును మాత్రం వ్యతిరేకిస్తారా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం మొదలుపెడతామని హెచ్చరించారు. అంతేకాకుండా, శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ -2 పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తానంటూ అన్నారు. 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని పైగా ఇది నూటికి కోటి శాతం కరెక్టేనని చెప్పారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని తమ్మినేని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments