Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - ఏపీఎస్ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో సోమవారం భారీ జాబ్ మేళాను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగనుంది. ఇందులో నోటిఫికేషన్‌లో భాగంగా, వరుణ్ మోటార్స్, మీషో, క్విస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ కంపెనీల్లో పలు ఉద్యోగాల పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. 
 
అయితే, డీమార్ట్‌లో క్యాషియర్, సేల్స్ అసోసియేట్, గోడౌన్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునేవారు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థతలు కలిగివుండాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.10,900 నుంచి రూ.11,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, ఒంగోలులలో పనిచేయాల్సి ఉంటుంది. 
 
అలాగే, వరుణ్ మోటార్స్‌లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా మెకానికల్, ఆటోమొబైల్, ఏదేని డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.8,500 నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 29 యేళ్లలోపు ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments