Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కైన వైకాపా నేత... కేసు నమోదు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:26 IST)
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేకాట ఆడుతూ పోలీసులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆయనపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత, అది కూడా అధికార పార్టీకి చెందిన నేతపై పోలీసులు పేకాట కేసు నమోదు చేయడం గమనార్హం. 
 
తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారావు, ప్రస్తుతం వైకాపాలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుబ్బారావు.. 1983 నుంచి పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేతిలో ఓటమి పాలయ్యారు. 
 
ఆ తర్వాత టీడీపీలో చేరిన వరుపుల ముద్రగడ పద్మనాభం చేతిలోనే ఓడిపోయారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఓడిపోయి.. 2014 ఎన్నికల్లో ఆయన తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో టిక్కెట్ రాకపోవడంతో వైకాపాలో చేరి అదే పార్టీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments