Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీస్ ... సీఎం కంగ్రాట్స్!

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:58 IST)
మహిళలు, పిల్లలపై  నమోదైన కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయడం, ఛార్జిషీట్ దాఖలు చేయడంలో దేశంలోనే ఎపి పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక విభాగం డి‌ఐజి పాలరాజు, సాంకేతిక బృందం సిబ్బందిని ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా డిజిపి అభినందించారు. వారికి డిస్క్ అను ప్రదానం చేశారు. 
 
 
నిర్ణీత వ్యవధిలో అంటే 60 రోజుల్లో ఛార్జి షీట్ దాఖలు చేసిన కేసులలో 93.8% రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదయ్యే కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తు పురోగతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరంతరం  పర్యవేక్షిస్తుంది.
 
 
ఇటీవల తిరుపతి లో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న అనంత‌రం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ పోలీసుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. దేశ స్థాయిలో ఉన్న‌తంగా నిల‌చినందుకు డీపీపీకి, ఇత‌ర పోలీసు అధికారుల‌కు సీఎం అభినంద‌న‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments