Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఎపి పోలీస్ ... సీఎం కంగ్రాట్స్!

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:58 IST)
మహిళలు, పిల్లలపై  నమోదైన కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయడం, ఛార్జిషీట్ దాఖలు చేయడంలో దేశంలోనే ఎపి పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక విభాగం డి‌ఐజి పాలరాజు, సాంకేతిక బృందం సిబ్బందిని ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా డిజిపి అభినందించారు. వారికి డిస్క్ అను ప్రదానం చేశారు. 
 
 
నిర్ణీత వ్యవధిలో అంటే 60 రోజుల్లో ఛార్జి షీట్ దాఖలు చేసిన కేసులలో 93.8% రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదయ్యే కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తు పురోగతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరంతరం  పర్యవేక్షిస్తుంది.
 
 
ఇటీవల తిరుపతి లో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న అనంత‌రం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ పోలీసుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. దేశ స్థాయిలో ఉన్న‌తంగా నిల‌చినందుకు డీపీపీకి, ఇత‌ర పోలీసు అధికారుల‌కు సీఎం అభినంద‌న‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments