Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పంచాయతీ పోరు : నేడు తొలి దశ నోటిఫికేషన్

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (07:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, తొలి దశ కోసం నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. తొలి విడతలో 11 జిల్లాలకు సంబంధించి ఒక్కో డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాలను మినహాయించారు. 
 
నిజానికి ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఏపీ సర్కారు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇదే అంశంపై ఏపీ సర్కారు, ఎస్ఈసీకి మధ్య హైడ్రామా నడించింది. ఓ వైపు వ్యాక్సినేషన్, మరోవైపు ఎన్నికలు సాధ్యం కావని, కాబట్టి నోటిఫికేషన్ వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది. 
 
అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకే రమేశ్ కుమార్ మొగ్గు చూపుతున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాలను, హింసను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో 9 మంది అధికారులను నిమ్మగడ్డ విధుల నుంచి తప్పించారు.
 
నోటిఫికేషన్ విడుదల కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లకు నిమ్మగడ్డ లేఖలు రాశారు. 
 
అయితే, నిమ్మగడ్డ లేఖను వారు పట్టించుకోలేదు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీ, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 
 
మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. కానీ, దీనిపై స్పష్టత ఇవ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments