Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేజీఎఫ్-2 రికార్డుల పంట.. రూ.50 కోట్లకు పైనే తెలుగు హక్కులు

కేజీఎఫ్-2 రికార్డుల పంట.. రూ.50 కోట్లకు పైనే తెలుగు హక్కులు
, గురువారం, 21 జనవరి 2021 (14:54 IST)
కేజీఎఫ్-2 కోసం సినీ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మూవీగా ఈ సినిమా నిలిచింది. దానికి ఈ సినిమా టీజర్ చేసిన రికార్డులు నిదర్శనం. అయితే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ ఇందులో పవర్ ఫుల్ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. 
 
భారీ నటులతో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ రూపొందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతి భాషలోనూ భారీ డిమాండ్ ఉంది. ఈ సినిమా మొదటి భాగం తెలుగులో డీసెంట్‌గా విడుదల చేశారు. కానీ ఫలితం మాత్రం చాలా వైలెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.
 
అలాంటిది చాలా వైలెంట్‌గా రిలీజ్‌కు సిద్దమైన రాకీ భాయ్ డిమాండ్ ఏరేంజ్‌లో ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా కచ్చితంగా రూ.50కోట్ల పైమాట పలుకుతుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా హక్కులు ఎంత ఖరీదు పలుకుతాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ కాలికి శస్త్ర చికిత్స, రజినీలా రాజకీయాలకు దూరమవుతారా? కానీ...