సీఎం జగన్ మహిళా పక్షపాతి.. గోరంట్ల వీడియో మార్ఫింగ్: ఆర్కే రోజా

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (18:59 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ఏపీ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. పైగా, హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియో వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేశారన్నారు. 
 
 
వీడియో నిజమో, కాదో తెలసుకోకుండా టీడీపీ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సీఎం జగన్ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో మహిళపై లెక్కలేనని దాడులు జరిగిన ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని విమర్శించారు. నారాయణ స్కూల్స్‌లో ఆడపిల్లలు చనిపోతే ఒక్క కేసైనా పెట్టారా? అంటూ నిలదీశారు. 
 
మరోవైపు, ఇటీవల తాను కొత్త కారు కొంటే టీడీపీ నేతలు 'రుషికొండ గిఫ్ట్' అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారన్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పన్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కారు కొనాలంటే లోన్ తీసుకుంటే సరిపోతుందని, తాను కారు కొనడం గొప్పేమీ కాదని అన్నారు. తన కొత్త కారు విషయంలో ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు ఏదీ దొరక్క ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని రోజా విమర్శించారు. 
 
ఏది అమ్మినా, ఏది కొన్నా ఎంతో పారదర్శకతతో ఉంటానని స్పష్టం చేశారు. చదువురాని వారికి కూడా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థమవుతుందని రోజా వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం