Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు - 39 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (18:31 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. అయితే, క్షతగాత్రులను రక్షించడంలో తీవ్ర జాప్యం జరుపుతోంది. దీనికి కారణం ప్రమాదం జరిగిన ప్రాంతంలో వర్షం కురుస్తోంది. బస్సు అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. 
 
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మరో 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ముస్సోరి పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను వెలికి తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments