Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు - 39 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (18:31 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. అయితే, క్షతగాత్రులను రక్షించడంలో తీవ్ర జాప్యం జరుపుతోంది. దీనికి కారణం ప్రమాదం జరిగిన ప్రాంతంలో వర్షం కురుస్తోంది. బస్సు అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. 
 
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మరో 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ముస్సోరి పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను వెలికి తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments