Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (14:30 IST)
రాజధాని అమరావతి నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని సేకరించినట్టు ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అనేక మంది రైతుల నుంచి 10.37 ఎకరాల సేకరించినట్టు చెప్పారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామన్నారు.
 
అలాగే, భూములిచ్చే రైతులకు వారు కోరుకున్న చోట స్థలాల కేటాయింపు చేపడుతామన్నారు. భూ సమీకరణలో భాగంగా ఎర్రబాలెంలో రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఎర్రబాలెం గ్రామంలో పది మంది రైతుల నుంచి 10.37 ఎకరాల భూమిని సేకరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే వారికి, వారు కోరుకున్న చోట స్థలాలు కేటాయిస్తామన్నారు. రైతులు తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములను తీసుకుంటామని చెప్పారు. అమరావతిలో ఎల్లుండి నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
 
ఇక, బుడమేరుకు మళ్లీ వరదలు వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ వరదలు వస్తున్నాయన్న ప్రచారం వైసీపీ కుట్ర అని ఆరోపించారు.  ఈ వదంతులు ఏవీ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అసత్య పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే... చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments