Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలతో సీఎంసీఎం అంటూ నినాదాలు చేయించుకునే వ్యక్తి పవన్ : కొడాలి నాని

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:29 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకునే వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. 
 
పేమెంట్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సొల్లు కబుర్లు చెబుతార‌ని ఆయ‌న అన్నారు. జ‌న‌సేన సైనికులు ఇప్పుడు జన సైకిల్‌గా మారారని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇస్తే క్యాల్షీట్ పూర్తి చేసి వెళ్లే పవన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా అంటూ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో మంగ‌ళ‌గిరిలో చిత్తుగా ఓడినప్పటికీ నారా లోకేశ్‌కు, ఆయన తండ్రి చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. ఎన్నిక‌ల్లో ఇక‌పై చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావోన‌ని విమ‌ర్శించారు. 
 
సీపీఎం, బీజేపీ పార్టీల‌కు నోటాకు ప‌డిన‌న్ని ఓట్లు కూడా ప‌డ‌వ‌ని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో స్వర్ణపాలన సాగుతోందని, సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments