Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి - మోహన్ బాబు వంటి పెద్దలకు లేని దూల పవన్‌కు ఎందుకు : మంత్రి బొత్స

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:59 IST)
వైకాపా ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నోరుందికదాని ఇష్టానుసారంగా పారేసుకుంటే సహించబోమని హెచ్చరించారు.

ఆయన ఆదివారం విజయనగరంలో సిరిమాను ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 'సినిమా టికెట్ల అంశంలో జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలు సరికాదు. టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచేస్తామంటే కుదరదు. ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? జీఎస్టీ వంటి పన్నులను స్ట్రీమ్‌లైన్‌ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారు. నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.
 
చిత్ర పరిశ్రమలో పవన్‌తో పాటు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, మోహన్‌బాబు వంటి పెద్దలు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు అదుపులో ఉండాలి' అని బొత్స హితవు పలికారు. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలోనూ ఆయన స్పందించారు. 'మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టం. మంత్రివర్గంపై పూర్తి స్వేచ్ఛ ఉంది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే' అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments