మూడు రాజధానుల ముచ్చట తీర్చుకుంటాం : మంత్రి బొత్స

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (13:46 IST)
తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడివుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. 
 
పైగా మూడు రాజధానుల అంశంలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు చేసే విమర్శలను అస్సలు ఏమాత్రం పట్టించుకోబోమని ఆయన స్పష్టంచేశారు. 
 
పైగా, మూడు రాజధానుల అంశంపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదించి ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. 
 
ప్రస్తుతం సీఆర్డీఏ చట్టం అమల్లో ఉందని చెప్పిన మంత్రి బొత్స.. గతంలో అమరావతి రాజధాని భూములు టిడ్కోకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  తనాఖా పెట్టారని గుర్తుచేశారు. అందువల్ల ఇపుడు తాము తనాఖా పెడితే తప్పేమీ లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments