Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరానికి లిఫ్టులు పెట్టి రూ.400 కోట్లు దొబ్బేశారు : మంత్రి అనిల్

Webdunia
గురువారం, 11 జులై 2019 (11:34 IST)
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టుకు సర్వ అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని గుర్తుచేశారు.
 
ముఖ్యంగా, కేంద్రం నుంచి అనుమతుల తీసుకురావడం దగ్గరి నుంచి కాలువ పనుల వరకూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని సభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దొబ్బేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
దీంతో దొబ్బేయడం(దొంగలించడం) అనే పదాన్ని వాడటంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. సభాపతి తమ్మినేని సీతారాం కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా, ఆన్‌పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. 
 
దీంతో చివరికి తన వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి అనిల్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైఎస్‌కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని పునరుద్ఘాటించారు. మొత్తంమ్మీద ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments