Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారు : మంత్రి అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:08 IST)
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు రైతులను ఉద్దేశించి ఘాటైన వాఖ్యలు చేశారు. రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన మూడో విడత చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, అమరావతి ప్రాంతంలో రాజధాని కావాలనే పేద రైతులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరన్నారు. యాత్ర చేసేవారంతా ఒళ్లు బలిసి చేస్తున్న వారేనని, వారంతా డబ్బున్నవారన్నారు. 
 
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారన్నారు. ఇపుడు వారి భూములకు విలువ తగ్గిపోతుందని భయంతో అమరవాతి రైతుల పేరిట రాజకీయ యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కావాలంటే గుడివాడ వెళ్లి తొడ కొడితేనే, మీసం మెలేస్తేనే రాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments