Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పు లేదు : మంత్రి సురేష్

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (15:37 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేత నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 
 
ఆయన గురువారం అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అయితే పదో తరగతి పరీక్షలు ఈనెల 31 నుంచి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఇంటర్ పరీక్షలు కూడా ఈనెల 23వ తేదీలోగా పూర్తికానున్నట్లు చెప్పారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 
 
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య సౌకర్యం అందజేస్తున్నామన్నారు. సెలవుల విషయంలో ఈనెల 31వ తేదీ తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments