Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం - తెలంగాణ నేతల సంతాపం

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన తీవ్రగుండెపోటుకు గురికావడంతో ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే, మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రులు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతితో పాటు తమ సంతాపాలను తెలిపారు. 
 
గౌతం రెడ్డి మృతి చెందారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 
ఇకపోతే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత మరణం తమను కలిచివేసిందన్నారు. గౌతం రెడ్డి ఆత్మకు శాంతిచేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 
 
తన ప్రియ మిత్రుడు మేకపాటి గౌతం రెడ్డి ఇకలేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు షర్మిల ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments