Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ట్రిపుల్ ఆర్‌'కు షాకిచ్చిన ఏపీ హైకోర్టు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (14:28 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్)కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరుతో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపించి ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 
 
ఇందుకోసం ఏపీ మద్యం చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన సవరణల చట్టాన్ని రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, వ్యాజ్యాన్ని కొట్టివేసింది. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా రఘురామరాజు చేతికి రాలేదు. దీంతో ఈ పిటిషన్‌ను ఏ కారణంతో కొట్టివేసిందో తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments