Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ విమానాశ్రయ ఘటన : ఇద్దరు ఖాకీలపై వేటుపడింది..

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (08:51 IST)
గత నెల 15వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్టణ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టులో వైకాపా మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేసినట్టు కేసులు నమోదయ్యాయి. అయితే, ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏసీపీ, సీఐ నిర్లక్ష్యంగా వ్యవహించినట్టు గుర్తించి, తాజాగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
వైకాపా ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరిగిన రోజే పవన్ కళ్యాణ్ కూడా విశాఖకు చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జనలో పాల్గొన్న మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డిలు విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జనసేన శ్రేణులు మంత్రులపై దాడికి యత్నించినట్టు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పలువురు జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు. 
 
అయితే, ఘర్షణ జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్న పశ్చిమ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్  ఏసీపీ టేకు మోహన రావు, సీఐ ఉమాకాంత్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఉన్నతాధికారుల విచారణలో తేల్చారు. దీంతో వారిద్దరినీ వీఆర్(వేకెన్సీ రిజర్వు)కు పంపించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments