Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగన్‌వాడీ సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (16:36 IST)
తమ సమస్యల పరిష్కారం కోసం గత 22వ రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లో చేరాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనవరి 5వ తేదీకి విధులకు హాజరుకాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
 
తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు సమ్మె చేపట్టారు. ఇది 22వ తేదీకి చేరుకుంది. పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తూ, అధికార ప్రతినిధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరోవైపు, ఆందోళన విరమించి తక్షణ విధుల్లో చేరాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ క్రమంలో అంగన్‌వాడీలకు ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని అల్టిమేటం జారీచేసింది. విధులకు హాజరుకానివారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్‌వాడీ సిబ్బందికి నోటీసులా జారీచేసింది. అయితే, ఇపుడు ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో అంగన్‌వాడీ సిబ్బంది దిగివస్తారా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments