Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగన్‌వాడీ సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (16:36 IST)
తమ సమస్యల పరిష్కారం కోసం గత 22వ రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లో చేరాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనవరి 5వ తేదీకి విధులకు హాజరుకాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
 
తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు సమ్మె చేపట్టారు. ఇది 22వ తేదీకి చేరుకుంది. పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తూ, అధికార ప్రతినిధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరోవైపు, ఆందోళన విరమించి తక్షణ విధుల్లో చేరాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ క్రమంలో అంగన్‌వాడీలకు ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని అల్టిమేటం జారీచేసింది. విధులకు హాజరుకానివారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్‌వాడీ సిబ్బందికి నోటీసులా జారీచేసింది. అయితే, ఇపుడు ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో అంగన్‌వాడీ సిబ్బంది దిగివస్తారా లేదా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments