Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే జోన్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించలేదు : రైల్వే మంత్రి అశ్విని

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (09:32 IST)
దక్షిణ కోస్తా పేరుతో ఏర్పాటు చేయాల్సిన రైల్వే జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని కేటాయించలేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో భాగంగా, టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. జోన్‌కు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) పూర్తయిందని, 2023-24 సంవత్సరానికి కూడా రూ.10 కోట్లు కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. కానీ, ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయిచలేదని చెప్పారు. 
 
"దక్షిణకోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీపీఆర్ తయారైంది. రూ.106.89 కోట్ల అంచనా వ్యయంతో ఈ జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మూజురు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించారు. భూసర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే ఔట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు అప్పగించాం. 
 
బస్ ర్యాపిడ్ సిస్టమ్ (బీఆర్టీఎస్) కోసం ఏపీ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందు దానికి బదులుగా ముడసర్లోవలోని 52.2 ఎకరాల గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన భూమిని ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించాల్సివుంది. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి, రైల్వే శాఖకు అప్పగించాల్సివుంది" అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైజాగ్ జంక్షన్ - గోపాలపట్నం మధ్య 15.31 కిలోమీటర్ల మేర రూ.159.47 కోట్లతో రూ.3, 4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్ నెలలో అనుమతులు మంజూరు చేసినట్టు మంత్రి మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments