అంగన్‌వాడీలకు చుక్కలు చూపుతున్న సీఎం జగనన్న - సెలవులు రద్దు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం పగటిపూటే చుక్కలు చూపుతోంది. అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులతో పాటు అధికార యంత్రాంగాన్ని ప్రయోగించింది. 
 
అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు సోమవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే, ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వొద్దంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, ముందుగా ముంజూరు చేసిన సెలవులను కూడా రద్దు చేశారు. పైగా, ప్రతి ఒక్కరూ హాజరు పట్టికలో విధిగా సంతకాలు చేసి, వాటిని స్కానింగ్ చేసి పంపాలంటూ ఆదేశించారు. ఈ ఆదేశాలతో పాటు అధికారుల వ్యవహారశైలిపై అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతేకాదు, ఛలో విజయవాడలో ఎవరూ పాల్గొనవద్దని కూడా పేర్కొంది. సెక్షన్ 144 కింద విజయవాడలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, వాటిని ఉల్లంఘించి ఛలో విజయవాజడలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏవేని సమస్యలు ఉన్నట్టయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వినతిపత్రాలు ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments