చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తునకు జగన్ సర్కారు వ్యూహం?

Webdunia
ఆదివారం, 14 మే 2023 (19:46 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అమరావతి దరిదాపుల్లో లేకుండా చేయాలన్న లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం పని చేస్తున్నట్టుగా ఉందని టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. 
 
ఇందులోభాగంగా, విజయవాడకు సమీపంలోని ఉండవల్లి కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌ చేసింది. కొన్నేళ్లుగా తెదేపా అధినేత చంద్రబాబు లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ అభియోగం మోపింది. క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని ఆస్తుల జప్తునకు సీఐడీ ఆదేశాలు జారీ చేసింది.
 
స్థానిక ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సమాచారం ఇచ్చి కరకట్ట పక్కన ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ జప్తునకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని తెలుగుదేశం పార్టీనేతలు తప్పుబడుతున్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. వైకాపా ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments