Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన విద్యా విధానం 2020పై గవర్నర్ల సదస్సులో పాల్గొననున్న బిశ్వభూషణ్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:20 IST)
ఉన్నత విద్యావిధానంలో మార్పులు ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం 2020పై నిర్వహిస్తున్న గవర్నర్ల సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్‌కు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆహ్వానం పలికారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెప్టెంబర్ 7న ఈ కార్యక్రమం జరగనుండగా, అధ్యక్షుడు శ్రీ రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం గవర్నర్ శ్రీ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై చర్చించారు.
 
ఏడవ తేదీ నాటి సదస్సులో అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు. గవర్నర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి  రమేష్ పోఖ్రియాల్ పాల్గొననుండగా,  రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రారంభోపన్యాసం చేస్తారు.
 
ఈ సమావేశంలో అన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యా శాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, విద్యాశాఖ కార్యదర్శులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యదర్శులు పాల్గొననున్నారు. వర్చువల్ విధానంలో ఎక్కడి వారు అక్కడే ఉండి ఈ సదస్సులో తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేకించి నూతన విద్యావిధానంపై అమలుపై లోతైన చర్చకు నిర్ధేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments