Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 నుంచి ఏపీలో కరోనా టీకాల పంపిణీ .. ముందు ఓ లారీ డ్రైవర్‌కు..

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే... తొలుత కృష్ణా జిల్లా నుంచి కరోనా టీకాలను పంపిణీ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అదీకూడా తొలి టీకాను ఓ లారీ డ్రైవర్‌కు వేయాలని భావిస్తోంది. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో అనేక దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. భారత్‌లోనూ మరికొన్నిరోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ షురూ కానుంది. 
 
అయితే, వ్యాక్సిన్ పంపిణీ వేళ తలెత్తే సమస్యలను అంచనా వేయడానికి దేశంలో నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఏపీలో ఈ మాక్ డ్రిల్‌కు సంబంధించిన సన్నాహాలకు ప్రభుత్వం తెరలేపింది. రాష్ట్రంలో అందుకోసం కృష్ణా జిల్లాను ఎంపిక చేశారు.
 
జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో కో-విన్ అనే యాప్ ద్వారా వ్యాక్సిన్ అందించేవారి జాబితా రూపొందిస్తారు. ఈ డ్రై రన్ ప్రక్రియలో వైద్య బృందాలు కూడా పాల్గొంటాయి. 
 
దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, ఈ నెల 27 నుంచి  29 వరకు కరోనా వ్యాక్సిన్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం యాప్‌కు సంబంధించిన మాక్ డ్రిల్ చేపడతామని, ఎల్లుండి వ్యాక్సిన్ రవాణా, పంపిణీ, ఈ నెల 29న వ్యాక్సిన్ ట్రయల్ రన్ ఉంటుందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments