Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధులు పుష్కలం... సాంకేతిక సమస్యల వల్లే జీతాలు ఆలస్యం : మంత్రి బొత్స

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (09:12 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సాగుతున్న ప్రచారాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. నిధులు పుష్కలంగానే ఉన్నాయని, కానీ, సాంకేతిక కారణాలతోనే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
మంగళవారం జరిగిన టీచర్స్ డే వేడుకల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై వారికి అభినందనలు తెలపుతూ వారికి పురస్కారాలను అందజేశారు. 
 
ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని కొందరు విమర్శిస్తున్నారని, అయితే, సాంకేతిక కారణాలతో జీతాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఉపాధ్యాయులకు వేతనాలు జమ చేస్తామని చెప్పారు. ఇక ఉపాధ్యాయ నియామకాలపై ఆయన స్పందిస్తూ, నెల రోజుల్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments