Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ల్ కోసం టెంప్ట్ అయితే ఇరుక్కోక తప్పదు: ఎపీ డిజిపి గౌతం సవాంగ్ వార్నింగ్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:40 IST)
ఎపీ పోలీస్ శాఖలో సిబ్బంది అవినీతిపై డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫర్లకు టెంప్ట్ అవటం వలనే పోలీసు శాఖలో అవినీతి బయటపడుతుందని, ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పోలీసు సిబ్బంది టెంప్ట్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. తొందరపడితే కేసుల్లో ఇరుక్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
 
అంతేకాదు, ఇప్పటివరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం నమోదు చేసిన కేసుల్లో 53 మంది పోలీసుల పాత్ర కూడా ఉందని వారిపై కూడా కేసులు నమోదు చేశామని డీజీపీ స్పష్టం చేశారు. సొంత శాఖలలో పని చేస్తున్న వారిపై కేసులు పెట్టటం బాధగా ఉన్నా తప్పటం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
ఇలాంటి అవినీతి పనులకు పోలీసులు దూరంగా ఉండాలని డీజీపీ పిలుపునిచ్చారు. పోలీసు శాఖలో సత్ప్రవర్తన, ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించటంపై ఎపీలోని 76 వేల మంది పోలీసులతో వెయ్యి ప్రాంతాల నుండి ఒకేసారి డీజీపీ ఆన్లైన్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. పోలీస్ స్టేషన్లకు ఎవరూ రావాలని కోరుకోరనీ, తీరని అన్యాయం జరిగినప్పుడు మాత్రమే బాధితులు పోలీస్ స్టేషన్ తలుపు తడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments