Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మకాయలకు షాకిచ్చిన సోదరుడు... బాబుకు ఏం చెపుతారు?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (14:18 IST)
ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్ర హోంశాఖా బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే, ఆయన సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి మాత్రం చినరాజప్పతో పాటు.. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తేరుకోలేని షాకిచ్చారు. 
 
నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ) జనసేన పార్టీలో చేరారు. శనివారం పెదగాడవిల్లిలో జనసేన పార్టీ గుర్తు గ్లాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన పార్టీలో చేరారు. లక్ష్మణమూర్తి ఏ పార్టీలోను క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఆయన పార్టీలో చేరికపై జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జనసేన మాత్రమే చురుకైన పాత్రను పోషిస్తుందన్నారు. అందుకే తాను జనసేన వైపు మొగ్గు చూపినట్టు చెప్పారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చడం వల్లే తాను జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలిపారు. 
 
అంతేకాకుండా, తమ స్వగ్రామం పెదగాడవిల్లి అయినప్పటికీ పొరుగున ఉన్న చినగాడవిల్లి, మునిపల్లి గ్రామాల్లోని కాపు సామాజికవర్గం తమ కుటుంబానికి మూడున్నర దశాబ్దాలుగా అండగా ఉన్నారని అన్నారు. ఈ కారణంగానే తన తండ్రి వెంకటరంగయ్య అనంతరం సోదరుడు జగ్గయ్యనాయుడు సొసైటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా కొనసాగుతున్నారన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments