Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల్లోగా జగన్ జైలుకెళ్లడం ఖాయం: కేఈ కృష్ణమూర్తి జోస్యం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు మించిన కేసులు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయన్నారు

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (12:40 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు మించిన కేసులు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయన్నారు. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై జగన్‌కు గౌరవం లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఓ అరాచకవాదిలా రాష్ట్రంలో గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. జగన్ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని మండిపడ్డారు.
 
2019 ఎన్నికల్లోగా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కేఈ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్ చేయడమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి... ప్రస్తుతం ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 
 
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పాదయాత్ర ముగిసేలోపు అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ కావడం ఖాయమని చెప్పారు. జగన్ పాదయాత్రలు చేస్తే తమకేం అభ్యంతరం లేదని మంత్రి ఆది చెప్పారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించాలనే నిర్ణయం వెనుక జగన్ కుట్ర ఉందని చెప్పుకొచ్చారు. తన ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే భయంతోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments