Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో ఏపీ సహకార సంఘాల ఎన్నికలు!

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (11:21 IST)
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సింగిల్‌ విండోలకు) ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. 2013 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సింగిల్‌విండోలకు ఎన్నికలు జరిగాయి.

వారి పదవీకాలం 2018 ఫిబ్రవరిలో పూర్తయింది. అప్పటి నుంచి 2019 జూలై తరువాత పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలు కొనసాగాయి. ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడంతో సింగిల్‌విండోలకు అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించారు.

సహకార ఎన్నికల ప్రక్రియకు సుమారు 45 రోజులు వ్యవధి కావాల్సి వస్తుంది. సంఘాల్లో సభ్యుల వారీగా తొమ్మిది అంశాలతో కూడిన వివరాలను సహకార శాఖ అధికారులు సేకరిస్తున్నారు. విండోల్లో రూ.300 షేర్‌ ధనం కలిగినవారే ఓటు హక్కు కలిగి ఉంటారు.

రెవెన్యూ గ్రామాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో పురుషులు, స్ర్తీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో జాబితా తయారు చేసి సహకార శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments