Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పుర, నగరపాలక ఎన్నికలకు 9,308 కేంద్రాలు

ఏపీలో పుర, నగరపాలక ఎన్నికలకు 9,308 కేంద్రాలు
, సోమవారం, 1 మార్చి 2021 (10:50 IST)
ఏపీలో మార్చి 10ననిర్వహించనున్న పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 నగరపాలికలు, 75 పురపాలికలు, నగర పంచాయతీల్లో మొత్తం 9,308 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది.

ఈ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 91,17,511 మంది ఓటర్లున్నారు. ఎన్నికల విధుల కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని గుర్తించింది. ఈ మేరకు పోలింగ్‌ కేంద్రాలు, పురపాలక సంఘాలవారీగా సిబ్బంది ఇతరత్రా వివరాలతో రూపొందించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందించింది.

అత్యధికం విశాఖలోనే...
* అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,818 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కృష్ణాలో 1,124, గుంటూరులో 1,078 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 111 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* నగర, పురపాలికలు, నగర పంచాయతీలవారీగా చూస్తే విశాఖలో 18,36,224 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలులో 10,85,758, గుంటూరులో 10,77,617, కృష్ణాలో 10,76,374 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేవలం 96,574 మంది ఓటర్లున్నారు.
పూర్తికాని సిబ్బంది కేటాయింపు
ఎన్నికల నిర్వహణ కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని పురపాలక శాఖ గుర్తించింది. విధుల కోసం ఇప్పటివరకూ 48,181 సిబ్బందిని గుర్తించామని, 43,021 మంది కేటాయింపు పూర్తయిందని నివేదికలో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహితను ఒకరు పట్టుకోగా మరొకరు అత్యాచారం.. అసలక్కడ ఏం జరిగింది?