Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెజిట్ మనమే కోరాం... కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దాం : సీఎం జగన్

Webdunia
శనివారం, 17 జులై 2021 (13:37 IST)
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధిలోకి తెస్తూ కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ గెజిట్ తీసుకుని రావాలని మనమే కోరామని, అందువల్ల ఈ చర్యను స్వాగతిద్దామని పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 
 
ఈ గెజిట్‌పై ఆయన స్పందిస్తూ, ఈ ప్రకటనను ఓవరాల్‌గా స్వాగతించి లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దాలని కేంద్రానికి లేఖ రాద్దామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు. 
 
కేంద్రం గెజిట్ విడుదల చేసిన తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో కార్యదర్శి జె.శ్యామల రావు, సి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments