కేసీఆర్ చాలా మంచోడు.. చంద్రబాబు రాక్షసుడు : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (10:52 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ చాలా మంచోడని, టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చూస్తే రాక్షసుడు గుర్తుకొస్తాడని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న వాటర్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజలకు మంచి చేద్దామని భావిస్తున్నాం. కానీ మా మాటలను ప్రజలకు వెళ్లనీయకుండా అడ్డుకోవాలన్న దుర్బుద్ధితో చంద్రబాబుతో పాటు.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఈ పెద్ద మనిషి అసలు మనిషేనా? ప్రతిపక్షం దుర్మార్గంగా గౌడవ చేస్తోంది. దుర్మార్గంగా, అన్యాయంగా మాట్లాడుతున్న ఈ పెద్దమనిషి మనిషేనా? ఈ మనిషిని చూస్తే దెయ్యమో, రాక్షసుడో గుర్తుకు వస్తాడు తప్ప మనిషి గుర్తుకురాడు అంటూ జగన్ ధ్వజమెత్తారు. 
 
పైగా, సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా వాడుకోవాలనే నీటి తరలింపు ఆలోచన చేశామన్నారు. ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటున్నాం. ఒకరికి మరొకరు తోడుగా ఉండాలనుకుంటున్నాం. కేసీఆర్‌పై నాకు ఎటువంటి ప్రేమలేదు. కానీ, ఆయన మంచివారు. జలాల తరలింపు విషయంలో ముందుకొచ్చారు అని జగన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments