Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకొస్తున్న మండూసు తుపాను.. జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (15:06 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. మాండూస్‌గా నామకరణం చేసిన ఈ తుపాను ప్రస్తుతం తీరం వైపు అమిత వేగంతో ప్రయాణిస్తుంది. ఇది శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి - శ్రీహరికోటల మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం చెన్నైకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
పైగా, ఈ తుపాను తీరందాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల దూరంలో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా ప్రకాశం, నెల్లరూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశారు. 
 
ఈ తుపాను తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికపుడు సమీక్షను నిర్వహిస్తూ, వాతావరణ శాఖ హెచ్చరికలు, సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఆయన కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments