Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి రెడ్డికి షాకిచ్చిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (16:13 IST)
వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. విశాఖ జిల్లా పార్టీ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి, ఆ బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా సమన్వయకర్త బాధ్యతలను కూడా సుబ్బారెడ్డికే సీఎం అప్పగించారు. 
 
ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డిపై ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది సొంత పార్టీ నేతలు అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం జగన్ ఆయన్ను విశాఖ బాధ్యతల నుంచి తప్పించారు. 
 
మరోవైపు, పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలకు ఏకంగా 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించక పోవడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పని చేయనున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డికి జగన్ మరింత ప్రాధాన్యతను కల్పించారు. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments