Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు....

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (12:33 IST)
ఆయన నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు.. అంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకుని సీఎం జగన్ ఆదివారం పులివెందుల నుంచి అమరావతి తాడేపల్లి ప్యాలెస్‌కు తిరుగు పయనమయ్యారు. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే, ఓ వ్యక్తి అర్జీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 
 
దాంతో జగన్.. ఆ ఆర్జీని పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ఇవ్వాలని సూచించారు. ఆ వ్యక్తి మాత్రం జగన్‌కే ఇచ్చేందుకు మరోమారు అర్జీ పత్రంతో చేయిని ముందుకు సాచారు. 
 
దీంతో జగన్ కల్పించుకుని 'నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు' అంటూ అవినాశ్‌కే ఇవ్వమన్నారు. పైగా, ఆ అర్జీని తీసుకోవాలని అవినాశ్‌కు సైతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  


 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments