Webdunia - Bharat's app for daily news and videos

Install App

3న ఆ రెండు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ - భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

Webdunia
సోమవారం, 1 మే 2023 (15:39 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మే మూడో తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ నిర్మాణం, తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు ప్రారంభిస్తారు. సవరవిల్లిలో జరిగే బహిరంగ సభ తర్వాత ఆయన విశాఖ పర్యటనకు బయలుదేరి వెళుతారు. 
 
మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖకు చేరుకునే ఆయన.. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఐటీ హిల్స్ నెంబరు 4లో గల వేదిక వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. 2.30 గంటలకు వైజాగ్ ఐటీ టెక్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. 
 
ఈ సందర్భంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తర్వాత మధ్యాహ్నం 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి రిషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదించి, ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్‌కు, 5.20 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు, 6.45 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments