Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (09:47 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముంపు పాలైన వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. గ‌త నాలుగైదు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు వంక‌లు పొంగి, రాష్ట్రం అత‌లాకుత‌లం అయిపోయింది.


ముఖ్యంగా  కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల‌లో భారీగా న‌ష్టం సంభ‌వించింది. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్చ‌ల‌పై ఎప్ప‌టిక‌పుడు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న సీఎం జ‌గ‌న్ ఈ రోజు నేరుగా, ఆ జిల్లాల‌ను ప‌రిశీలిస్తారు. భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. 
 
 
సీఎం ఈ ఉద‌యం గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.  కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల‌లో జ‌రిగిన న‌ష్టాన్ని, ముంపు అయిన ప్రాంతాల‌ను సీఎం ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ నుంచి ప‌రిశీలిస్తున్నారు. సీఎం ఏరియల్‌ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు సీఎం వైఎస్‌ జగన్‌, తుఫాను ప్ర‌భావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments