Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రపదేశ్ ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (16:26 IST)
ఆంధ్రపదేశ్ ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని.. మనం కేంద్రాన్ని అడగడం తప్పా.. ఇంక చేయగలిగినది ఏం లేదని జగన్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపామని.. ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా గాని ఇంకా ఏమన్నా చేయాలంటే చేయవచ్చు.. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది.. సంకీర్ణ ప్రభుత్వం అయి ఉంటే ఆలోచించవచ్చు కానీ పూర్తి మెజారిటీ ఉన్నాగానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మిన్నకుండిపోతోందని అన్నారు.
 
తాను కేంద్రాన్ని అడుగుతున్నా అని సీఎం జగన్ చెప్పారు కాని.. కేంద్ర ఏం చెపుతోంది అన్నదారిపై సీఎం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవ్వడం కుదరదనో.. లేక ఇప్పటిలో ఇచ్చే పరిస్థితి లేదని.. కాదు అంటే ప్రత్యామ్నాయం గురించో ఏదో ఒకటి సమాధానం చెప్పే ఉంటారు. కానీ సీఎం జగన్ మాత్రం కేంద్రం ఏం చెబుతోంది అన్న విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments