Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 నుంచి పల్నాడులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (11:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లాలోని నరసరావు పేట మండలంలోని యల్లమంద గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. యల్లమంద గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. పైగా, ఒక్క రోజు ముందుగానే సామాజిక పింఛన్లను ఇవ్వనున్నారు 
 
ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యల్లమంద గ్రామంలో సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ముందుగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జనవరి 1న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పులిపాడు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ప్రచారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో ఏర్పాట్లు చేస్తుండగా, సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
 
సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ యల్లమంద గ్రామంలో పర్యటించారు. అక్కడ హెలిపాడ్ నిర్మాణానికి అనువైన స్థలంతో పాటు సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments