Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు... టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌‌మెంట్‌కు చర్యలు

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (13:14 IST)
ఫైబర్‌నెట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ అధికారుల ప్రయత్నానికి హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. దీంతో ఈ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అదేసమయంలో ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. 
 
ఇందులోభాగంగా, టెరాసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు చేసిన ప్రతిపాదనకు ఏపీ రాష్ట్ర హోం శాఖ సైతం ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సీఐటీ అధికారులు ఆస్తులు అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన తర్వాత ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
మరోవైపు, సీఐడీ అటాచ్ చేయాలని భావిస్తున్న టెరాసాఫ్ట్‌కు చెందిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్టణంలోని ఓ ఫ్లాట్, హైదరాబాద్ నగరంలోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణ, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆహ్వానించిన ఫైబర్ నెట్ టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్‌కు ఆయాచిత లబ్ధికోసం కట్టబెట్టారన్నది సీఐడీ ఆరోపిస్తూ, కేసు నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments