నిద్రిస్తున్న మామను సజీవంగా దహనం చేసేందుకు కోడలి యత్నం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (12:44 IST)
పడక గదిలో మంచానికే పరిమితమైన మామను సజీవంగా దహనం చేసేందుకు ఓ ఇంటి కోడలు ప్రయత్నించింది. పేపర్‌ను కాల్చి ఆయన పడుకునివున్న పడక గదిలో వేసింది. దీంతో బెడ్‌పై దుప్పట్లకు మంటలు అంటుకోవడంతో ఆ వృద్ధుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తండ్రిని సజీవంగా దహనం చేసేందుకే తన భార్య ఈ దారుణానికి పాల్పడిందని భర్త ఆరోపిస్తున్నారు. 
 
ఈ వీడియోలోని వివరాలను పరిశీలిస్తే, సదరు మహిళ ఆ వృద్ధుడికి కోడలుగా తెలుస్తుంది. వారి ఇంట్లో ఏం జరిగిందో తెలియదుగానీ, పడక గదిలో మంచానికే పరిమితమైవున్న మామను సజీవంగా దహనం చేయాలని భావించింది. ఇందుకోసం ఆమె ఓ పేపర్‌ను కాల్చి పడక గదిలో పడేసింది. బట్టలకు మంటలు అంటుకుని ఎగిసిపడితే ఆ మంటల్లో సజీహదహనమైపోతాడని భావించింది. 
 
కానీ, తన భార్య ప్రవర్తనను అనుమానించిన ఆమె భర్త... ఆమె చేసిన పనిని ఫోనులో రికార్డు చేశాడు. అంతేకాకుండా ఆ మంటలు పడక గదికి అంటుకోకుండా పేపర్‌ను పక్కకు తోసేశాడు. తన తండ్రిని చంపేయాలని తన భార్య ప్రయత్నిస్తోందని అన్నాడు. ఈ హడావిడికి నిద్రలో నుంచి మేల్కొన్న వృద్ధుడు.. తన బెడ్‌పై మంటలు చూసి షాక్‌కు లోనయ్యాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments