Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీజీ నివేదిక కూడా అమరావతి తరలింపునకే మొగ్గు?

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (12:51 IST)
నవ్యాంధ్ర రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు(బీసీజీ)ను ఏపీ సర్కారు ఏర్పాటు చేసింది. ఈ బీసీజీ రాజధాని తరలింపుతో పాటు.. అభివృద్ధి, మౌలిక సదుపాయాలరూపకల్పన తదితర అంశాలపై ఓ నివేదిక ఇవ్వనుంది. రాజధాని తరలింపుపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో రాజధానిని విశాఖకు తరలించాలని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చే నెల మూడో తేదీన బీసీజీ తన నివేదికను సమర్పించనుంది. ఇది కూడా రాజధానిని తరలించాలని సూచన చేయనున్నట్టు సమాచారం. 
 
ఎందుకంటే ఈ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఇందులో అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. పూర్తిగా నూతన నగరాన్ని (గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా) రాజధానిగా అభివృద్ధి చేయడమంటే రాష్ట్ర ఖజానాపై పెనుభారం మోపడమేనని అభిప్రాయపడింది.
 
అదేసమయంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన (బ్రౌన్‌ఫీల్డ్) నగరంలో రాజధానిని ఏర్పాటు చేయడం అన్ని విధాలా మంచిదని బీసీజీ మధ్యంతర నివేదిక పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాజధాని వికేంద్రీకరణ ద్వారా అమరావతి రైతులు నష్టపోకుండా చూడడంతోపాటు, విజయవాడను మహానగరంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేసింది. కృష్ణా నదిపై మూడు చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేయడం వల్ల ఆ ప్రాంతంలోని భూముల ధరలు పడిపోకుండా చూడొచ్చని పేర్కొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments