Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:30 IST)
ఆంధ్రప్రదశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతుంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేశారు. మార్చి నెలలో ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమావేశాలను మార్చి 4 లేదా 7వ తేదీల్లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. 
 
ఉగాది పండుగ నుంచి కొత్త జిల్లాల పరిపాలనను ప్రారంభించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే, ఉగాదికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈ లోగానే కొత్త జిల్లాల బిల్లుకు ఆసెంబ్లీ ఆమోదం పొందడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ సమావేశాలకే కాదు ఇకపై అసెంబ్లీలో జరిగే ఏ ఒక్క సమావేశాలకు హాజరుకారు. ఇకపై ముఖ్యమంత్రి హోదాలోనే తాను సభలో అడుగుపెడతానని ఇటీవల చంద్రబాబు భీష్మ ప్రతిజ్ఞ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments